177పరుగులకే ఆసీస్‌ ఆలౌట్

177పరుగులకే ఆసీస్‌ ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫి మొదటి టెస్టు  మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టును ఫస్ట్ ఇన్నింగ్స్ లో  177పరుగులకే ఆలౌట్ చేశారు. జడేజా5 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించారు. టెస్టుల్లో జడ్డూ ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది 11వ సారి కావడం విశేషం. అశ్విన్‌ మూడు, సిరాజ్‌, షమి తలో వికెట్‌ పడగొట్టారు. ఆసీస్‌ బ్యాటర్లలలో లబుషేన్ (49), స్టీవ్‌ స్మిత్ (37), పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ (31), లెక్స్ క్యారీ (36) పరుగులు చేశారు. ఆసీస్‌ బ్యాటర్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్...మరి బ్యాటింగ్ లో ఏ మేరుకు రాణిస్తుందో చూడాలి.