గోషామహల్, వెలుగు: మద్యం మత్తులో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఓ ఆటోడ్రైవర్ను గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్చేశారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సమీపంలో గురువారం ఉదయం పాఠశాల బస్సులు, స్కూల్ ఆటోలను ట్రాఫిక్ ఎస్సై జగదీశ్, హోంగార్డులు కిరణ్ కుమార్, సురేశ్తనిఖీ చేశారు.
అబిడ్స్ లోని ఓ పాఠశాలకు ఆరుగురు విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఆపారు. డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా.. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలో దింపారు. తదుపరి చర్యల కోసం డ్రైవర్ను గోషామహల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. షేక్ ఇస్మాయిల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
