కడుపులోనే శిశువు మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ధర్నా.. నల్గొండ జిల్లాలో ఘటన

 కడుపులోనే శిశువు మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ధర్నా.. నల్గొండ జిల్లాలో ఘటన

నల్గొండ అర్బన్, వెలుగు : కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి కడుపులోనే శిశువు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. తల్లికి కూడా సీరియస్​గా ఉండడంతో డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ధర్నాకు దిగారు. 

వివరాల్లోకి వెళ్తే.. గుడిపల్లి మండలం కేశినేని తండాకు చెందిన జటావత్ ఝాన్సీ తొలి కాన్పు కోసం ఈనెల 6న నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. చికిత్స అందిస్తుండగా గురువారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో డాక్టర్లు స్కానింగ్ కు రాశారు. అనంతరం రిపోర్ట్ ను పరిశీలించగా కడుపులోని బిడ్డ చనిపోయిందని నిర్ధారించారు. 

ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తుండగా.. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే కడుపులోని శిశువు మృతి చెందడమే కాకుండా తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వెళ్లి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.