భర్తతో హోటల్​లో ఉన్న మహిళపై గ్యాంగ్​రేప్

భర్తతో హోటల్​లో ఉన్న మహిళపై గ్యాంగ్​రేప్
  •      కర్నాటకలోని హవేరి జిల్లాలో ఈ నెల 7న జరిగిన దారుణం

బెంగళూరు: మతాంతర వివాహం చేసుకున్న జంటపై కర్నాటకలోని హవేరి జిల్లాలో జరిగిన దాడి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని 26 ఏండ్ల బాధితురాలు కోర్టులో జడ్జి ఎదుట స్టేట్​మెంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు నిందితులపై రేప్ కేసును అదనంగా నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. మతాంతర వివాహం చేసుకున్న యువతి ఈ నెల 7న తన భర్తతో హోటల్​లో ఉండగా ఆరుగురు యువకులు వారిపై దాడి చేశారు. అయితే, బాధితురాలు శుక్రవారం ఇచ్చిన స్టేట్​మెంట్​తో కేసు కొత్త మలుపు తిరిగింది. తనను హోటల్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి, కారులో మరో ప్రాంతానికి తీసుకెళ్లి ఏడుగురు అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొంది.