మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై పోలీసులు పిటీ వారెంట్ కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే.. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ2గా ఉన్న నందకుమార్.. ఇప్పటికే చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పోలీసులు వేసిన పీటీ వారెంట్కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. నిందితుడు నందకుమార్ ను అరెస్ట్ చేసి తిరిగి కోర్టులో హాజరుపరుచనున్నారు.
