న్యూఢిల్లీ: ప్రైవేట్ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ఎలియాంజ్ఇన్సూరెన్స్ కంపెనీ హైవాల్యూ కస్టమర్ల కోసం ప్రైవ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఎక్కువ విలువ గల పాలసీలు కొనేవాళ్లకు ప్రయారిటీ సర్వీసును తీసుకొచ్చింది. వీళ్లు త్వరగా బీమా డబ్బు పొందడానికి ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. +
వీటిలో హెల్త్, హోమ్, మోటార్, పర్సనల్ యాక్సిడెంట్, సైబర్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. కనీసం రూ.కోటి విలువైన పాలసీ తీసుకునే వాళ్లకు ప్రైవ్కింద మై హెల్త్కేర్ ప్లాన్కు అర్హులు. ఇట్లాంటి కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ప్రైవ్ కనెక్ట్ టీమ్సేవలను అందిస్తుంది.