మే 8లోగా పోలింగ్ స్లిప్పులు అందించాలి

మే 8లోగా పోలింగ్ స్లిప్పులు అందించాలి
  • బల్దియా కమిషనర్ ​ అశ్విని తానాజీ వాకడే 

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రాలను గురువారం బల్దియా కమిషనర్​ అశ్విని తానాజీ వాకడే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.  మే 8 లోగా  ప్రతి ఓటరుకు పోలింగ్​ చీటి అందజేయాలని అన్నారు.   ఉర్సు గుట్టు జంక్షన్​ ప్రాంతంలోని జేఎస్​ఎం పాఠశాలలో పోలింగ్​ సెంటర్​ను పరిశీలించారు.   సెంటర్లో  ర్యాంపు , కరెంట్​ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.  కార్యక్రమంలో తహసీల్దార్​ నాగేశ్వర్​ రావు, డీఈలు రవికుమార్​, సారంగం, కృష్ణమూర్తి, ఏఈ సరిత, తదితరులు ఉన్నారు. 

బల్దియా ఆవరణలో ముగ్గుల పోటీలు 

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం అని వరంగల్ జిల్లా స్వీప్​ ఆఫీసర్​ భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం బల్దియా ఆవరణలో  మెప్మా ఆధ్వర్యంలో పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో లీడ్​ బ్యాంకు   సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు.  పోటీల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు. కార్యక్రమంలో సత్య లక్ష్మి, విశ్వజ, సత్యం, రాజు, రాజేశ్​కుమార్, రమేశ్​​, వెంకట రమణ, ఆయూబ్​ తదితరులు ఉన్నారు.