శ్రీశైలం ఘటన బాధాకరం..విచారణ జరిపించాలి

శ్రీశైలం ఘటన బాధాకరం..విచారణ జరిపించాలి

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఈ ప్రమాదంలో కొందరు ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కల్గిస్తుందన్నారు.  వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.

ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సంజయ్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. రాష్ట్ర సాగునీరు, విద్యుత్ అవసరాలు తీర్చే శ్రీశైలం జలాశయం లాంటి సున్నితమైన, అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేయలన్నారు.

see more news

29 లక్షలు దాటిన కేసులు..54 వేలు దాటిన మరణాలు

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు