బండి సంజయ్..రేవంత్ రెడ్డి సరదా ముచ్చట్లు

బండి సంజయ్..రేవంత్ రెడ్డి సరదా ముచ్చట్లు

ఇద్దరు ప్రతిపక్ష నేతలు. పైగా రెండు పార్టీలకు అధ్యక్షులు. ఇరు పార్టీలకు అస్సలు పడదు. కానీ ఓ కార్యక్రమంలో ఆ ఇద్దరు నేతలు కలిశారు. కలవడమే కాదు సరదాగా కబుర్లు కూడా చెప్పుకున్నారు. దీనికి రాజ్ భవన్ ఎట్ హోం వేదిక అయ్యింది.  

ఒకరు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మరొకరు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరు ఎట్ హోం కార్యక్రమంలో సందడి చేశారు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. కార్యక్రమంలో ఇద్దరు కలిసి తిరగడం అందరినీ ఆకర్షించింది. పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఉండే వీళ్లు ఒకే చోట చేరి కలిసి మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు బీఆర్ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలతో రేవంత్ రెడ్డి సరదాగా ముచ్చటించారు. వీరి ముగ్గురు ఒకరినొకరు నవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలు కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్లి మరి రేవంత్ రెడ్డి పకలరించారు. రేవంత్ రావడంతో మంత్రులు కూడా కుర్చీలో నుంచి లేచి సరదాగా మాట్లాడారు.