వరంగల్ అర్బన్: కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆటమ్ బాంబ్ కాదు రాష్ట్రంలో అణు బాంబ్ పేలుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ను సీఎంను చేసే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్.. ఫామ్ హౌస్లో దోష నివారణ పూజలు చేశారన్నారు. ద్రవ్యాలను త్రివేణి సంగమంలో కలపడం కోసమే కాళేశ్వరం వెళ్లారని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనుక అసలు రహస్యం శనిపూజ కోసమేనన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ పొత్తుల పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
‘దమ్ముంటే కేసీఆర్ నాతో ఢిల్లీకి రావాలి. పొత్తులపై ఎవరు హామీ ఇచ్చారో తేలుస్తా. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్తో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తుపెట్టుకోదు. కేసీఆర్పై అసహనంతో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవడం కోసమే పొత్తుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు. యాక్షన్లో కేసీఆర్ను మించిన నటుడు లేడు. కేసీఆర్ను పెట్టి సినిమా తీస్తే టేకాఫ్ లేకుండా 20 గంటల్లో షూటింగ్ పూర్తవుతుంది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.