తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడింది

తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడింది

తెలంగాణ వచ్చినంకా ఎవరి బతుకులు బాగుపడలేదు, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మాజీ ఎంపీ భూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో అత్యాచారాలు చేసే వాళ్ళు బీఆర్ఎస్, ఎంఐఎం వాల్లే అయివుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైయ్యాయని వెల్లడించారు. వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కాదు.. హత్య చేస్తే ఈ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు ఆర్టీసి ఉద్యోగులు ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణలో ఆర్టీసి ఉద్యోగుల పరిస్థితి నేడు దుర్బరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టిన రైతులకు ఏమి ఉపయోగం లేదన్నారు. 

తెలంగాణకు రావాల్సిన నీరు రాకుండా కేసీఆర్, హరీష్ రావు సంతకాలు చేసి అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోడీ ఇస్తున్న డబ్బులు కేసీఆర్ దోచుకుంటున్నారని తెలిపారు. ఈ ఆరు నెలలుగా ముఖ్యమంత్రి ఎప్పుడు అభివృద్దిపై మాట్లాడలేదని.. అభివృద్దిపై ముఖ్యమంత్రి చర్చకు రా అని అడిగిన రావడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనీ అన్నారు.