కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. పాలమూరు ప్రాజెక్టును ముంచింది

కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. పాలమూరు ప్రాజెక్టును ముంచింది

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును 9 ఏండ్లపాటు పీడించిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చింది శూన్యమంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌‌‌‌కు సంజయ్ రిప్లై ఇచ్చారు.

పాలమూరుకు జాతీయ హోదాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారైనా ప్రతిపాదన పెట్టలేదంటూ లోక్​సభలో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని షేర్ చేశారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో హక్కుగా 575 టీఎంసీల జలాలు రావాలని, కానీ కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ అంగీకరించారని విమర్శించారు.