వడ్లు కొనే వరకు కేసీఆర్ ను ఉరికిస్తాం

వడ్లు కొనే వరకు కేసీఆర్ ను ఉరికిస్తాం

ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రైతు దీక్షలో మాట్లాడిన ఆయన.. 11 వ తేదీ వచ్చినా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాల్లేవన్నారు. తన  రాజకీయాల కోసం కేసీఆర్ రైతులను వాడుకుంటున్నారన్నారు. సన్న వడ్లు వేసిన రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో దొడ్డు వడ్లు సాగు చేస్తుండన్నారు. సీఎం కమీషన్లకు ఎగబడ్డడన్నారు. రైతుల బతుకులను బ్రోకర్ల చేతిలో పెట్టిండన్నారు. రాష్ట్రంలో సమన్వయ సమితులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏడేండ్ల నుంచి సీఎం  ఏం చేశాడని ప్రశ్నించారు. రైతుల వడ్లను కేంద్రమే పక్కా కొంటుందన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వనని కేసీఆర్ కేంద్రానికి లెటర్ రాసిచ్చాడన్నారు.

 రైతులను ఆదుకోవడానికి కేంద్రం మద్ధతు ధర పెంచిందన్నారు. రైతులకు భయపడే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తుండన్నారు. రైతుల వడ్లు కొనే వరకు కేసీఆర్ ను ఉరికిస్తామన్నారు. ఏ రాష్ట్రంలో లేని వడ్ల పంచాయితీ తెలంగాణలో ఎందుకు వచ్చిందో కేసీఆర్ చెప్పాలన్నారు. చేతనైతే వడ్లు కొనాలని లేకపోతే కేసీఆర్ గద్దె దిగాలన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఇసుక దందా ..భూదందా చేసిండని..ఇపుడు రైస్ దందా చేస్తున్నాడన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దిగించేందుకు బీజేపీ నేతలు పూనుకున్నారన్నారు బండి సంజయ్.