టీఆర్ఎస్ పార్టీ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుంది

టీఆర్ఎస్ పార్టీ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుంది

TRS పార్టీ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుని.. ఆ డబ్బులతోనే  తెలంగాణ‌లో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తీరు మార్చుకోవాలని చెప్పారు.

బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా హైద‌రాబాద్‌లో ఆయ‌న విగ్ర‌హానికి నివాళులర్పించారు బండి సంజ‌య్. ఆ తర్వాత మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇన్నేళ్లుగా సీఎం ఒక్కసారి కూడా జయంతి ఉత్సవాలకు రాలేదని... త‌న‌ ఫామ్ హౌస్‌లో ఆయన సేద తీరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ హామీ ఏమైంద‌ని ప్రశ్నించారు బండి సంజయ. ఈ విష‌యంలో ఆయా దళిత సామాజిక సంఘాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని అన్నారు.