ఏడేళ్లలో మోడీ దేశానికి ఎంతో చేశారు

ఏడేళ్లలో మోడీ దేశానికి ఎంతో చేశారు

కరీంనగర్: ప్రధానిగా నరేంద్ర మోడీ పాలనకు ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఈ  సందర్భంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఉచిత ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. మోడీ సర్కార్ 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ పథకం కింద అమలు చేస్తోందని సంజయ్ అన్నారు. మొదటి దఫా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బేటీ బచావో బేటీ పడావో అమలు చేశామన్నారు. రెండో దఫా అధికారం చేపట్టాక అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశామని.. 370 ఆర్టికల్ రద్దు, సీఏఏను కూడా అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. 

‘గత ఏడేళ్లలో ప్రధాని మోడీ దేశానికి ఎంతో సేవ చేశారు. సుపరిపాలన అందించారు. కరోనా మహమ్మారితో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి బృహత్తర కార్యక్రమన్ని చేపట్టాం. దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో లక్షలాది ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో బీజేపీ సంజీవని పేరిట ఉచితంగా 50 ఆక్సిజన్ కాన్‌‌సంట్రేటర్‌‌‌లను‌ అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలోనే ఉచిత అంబులెన్స్ సౌకర్యాలు కల్పిస్తాం’ అని బండి కిషన్ పేర్కొన్నారు.