రేపు, ఎల్లుండి జిల్లాల్లో బండి సంజయ్ పర్యటన

రేపు, ఎల్లుండి జిల్లాల్లో బండి సంజయ్ పర్యటన

వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామంటున్నారు బీజేపి నేతలు. రైతులు ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సంజయ్ పర్యటిస్తారు. నల్గొండ రూరల్ మండలం అర్జాలబావి ఐకేపీ సెంటర్ ను సందర్శించనున్నారు. మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. ఎల్లుండి తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్. వడ్ల అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు బండి సంజయ్.