ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ నుంచి గౌరవం దక్కింది: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ నుంచి గౌరవం దక్కింది: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ నుంచి గౌరవం దక్కిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలకు పాదయాత్రపై బండి సంజయ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాదయాత్ర సాగిన తీరు, ప్రజల నుండి వస్తున్న స్పందన గురించి వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించేందుకు పాదయాత్ర ఎలా ఉపయోగపడుతోంది అన్న అనేక అంశాలపై బండి సంజయ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

వచ్చే గురువారం పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగనున్న సందర్భంగా బీజేపీ సెంట్రల్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఫోన్ కాల్ వచ్చింది. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‭కు ముందుగానే పూర్తి వివరాలు తీసుకురావాలని లక్షణ్‭ను ప్రధాని మోడీ ఆదేశించారు. మరోవైపు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియో ప్రజెంటేషన్‭కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో నరేంద్రమోడీ, అమిత్ షాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు మీటింగ్ లో పాల్గొననున్నారు.