కంగనా‌‌పై కేసు నమోదుకు బాంద్రా కోర్టు ఆదేశం

కంగనా‌‌పై కేసు నమోదుకు బాంద్రా కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌‌పై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. తమ ట్వీట్లు, ఇంటర్వ్యూలతో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి యత్నించారనే కారణంతో కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలీ చండీలాపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. హిందూ, ముస్లిం ఆర్టిస్టుల మధ్య సామాజిక విభజన తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌‌నెస్ ట్రైనర్ మున్నారవలీ సయీద్ కంగనాపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. కంగనా ట్వీట్లతో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కంప్లయింట్‌‌‌లో సయీద్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.