Team India vs Bangladesh: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్ పోరులో భారత జట్టుపై తీవ్ర అహంకారం, పగ ప్రదర్శించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాకు ఘోర పరాభవం ఎదురుకానుంది. గురువారం భారత జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ ఆరంభంలో టాస్ సమయంలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కనీస గౌరవం ఇవ్వకుండా, షేక్ హ్యాండ్ (చేతి కరచాలనం) ఇచ్చేందుకు నిరాకరించి పక్కకు తప్పుకోవడం తీవ్ర దుమారం రేపింది. సాధారణంగా భారత్, పాక్ మధ్య ఉండే రాజకీయ ఉద్రిక్తతల తరహాలో సుల్తానా ప్రవర్తించిన ఈ వైఖరిపై క్రికెట్ ప్రపంచం విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తక్షణమే రంగంలోకి దిగింది.
చేతులు దులుపుకున్న బీసీబీ.. కెప్టెన్సీ ఊడటం ఖాయం:
మైదానంలో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన నిగర్ సుల్తానాపై బీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుల్తానా చేసిన ఈ అహంకార చర్యతో తమ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని బీసీబీ ఉమెన్స్ కమిటీ ఛైర్మన్ రఫికుల్ ఇస్లామ్ బాబు స్పష్టం చేశారు. హ్యాండ్షేక్ ఇవ్వకపోవడం పూర్తిగా ఆమె సొంత నిర్ణయమని, భారత్తో తమకు ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం జరగబోయే ఏషియన్ గేమ్స్ పోటీలు ముగిసిన వెంటనే సుల్తానాను కెప్టెన్సీ పదవి నుంచి శాశ్వతంగా ఊడదీసేందుకు బోర్డు రెడీ అయింది.
40 పరుగులతో బంగ్లాను తొక్కేసిన భారత్:
మైదానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ ఎన్ని వికృత చేష్టలు చేసినప్పటికీ, మ్యాచ్లో మాత్రం టీమిండియా బ్యాట్, బాల్తోనే సరైన సమాధానం చెప్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 149 పరుగుల స్కోరు సాధించగా, ఛేజింగ్లో భారత బౌలర్ల ధాటికి తాళలేక బంగ్లాదేశ్ 109 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగుల తేడాతో బంగ్లాను తొక్కిపడేసిన హర్మన్ప్రీత్ సేన సగర్వంగా పదోసారి ఆసియా కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఫైనల్ టార్గెట్ శ్రీలంక:
క్రీడాస్ఫూర్తిని విస్మరించి భారత్పై అహంకారం ప్రదర్శించిన నిగర్ సుల్తానా తన వైఖరికి కెరీర్నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. మరోవైపు సెమీస్లో బంగ్లాను ఊచకోత కోసిన టీమిండియా, సెప్టెంబర్ 13 ఆదివారం శ్రీలంకతో జరగబోయే హై-వోల్టేజ్ గ్రాండ్ ఫైనల్లో ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడటమే లక్ష్యంగా సమరానికి సిద్ధమైంది.
