హైదరాబాద్ లో ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్..13బైకులు స్వాధీనం

హైదరాబాద్ లో ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్..13బైకులు స్వాధీనం

హైదరాబాద్ లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. నగరంలోని పలు చోట్లు పార్కింగ్ చేసిన బైకులను చోరీచేసి వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు. శనివారం(జూన్ 21) బంజారా హిల్స్ పోలీసులు ముగ్గురు బైకు దొంగలను అరెస్టు చేశారు. వారి నుండి చోరీకి గురైన పదమూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నిమ్మతి శ్రీకాంత్ (32), నవీన్ (22) వివిధ సినిమా షూటింగ్‌లలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. నగరంలోని ప్రాంతాల్లో ఇద్దరూ నిరంతరం బైక్‌లను చోరీ చేస్తున్నారు. మూడవ నిందితుడు షేక్ కలీమ్‌కు ఈ బైకులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

శ్రీకాంత్ అనే నిందితుడు 2020 నాటి నుంచి పదే పదే బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో శ్రీకాంత్ పై ఇప్పటికే ఐదు కేసులున్నాయి. 

చోరీకి గురైన బైక్‌లపై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, గోపాలపురం, బోరబండ, మేడ్చల్, పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.