ఐర్లాండ్తో టీ20 సిరీస్కు టీమిండియా ప్రకటన

ఐర్లాండ్తో టీ20 సిరీస్కు టీమిండియా ప్రకటన

ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు  బీసీసీఐ టీమిండియాను ఎంపిక చేసింది.  మొత్తం 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ఐపీఎల్లో గుజరాత్ను విజేతగా నిలిపిన హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన సెలక్టర్లు..వైస్ కెప్టెన్గా సీనియర్ బౌలర్  భువనేశ్వర్ కుమార్ను నియమించారు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యారు. మిడిలార్డర్ కోసం  సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠిలకు స్థానం కల్పించారు. వికెట్ కీపర్గా  దినేష్ కార్తీక్ను ఎంపిక చేశారు.  ఆల్ రౌండర్లుగా  వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్లు చోటు దక్కించుకున్నారు.  స్పిన్నర్లుగా  రవి బిష్ణోయ్ , చాహల్లకు  ప్లేస్ దక్కగా..ఫాస్ట్ బౌలర్లుగా హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, అర్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్లు టీ20 సిరీస్కు ఎంపికయ్యారు.   ఇక ఐర్లాండ్తో జూన్ 26, 28న  టీమిండియా రెండు టీ20 మ్యాచులు ఆడనుంది. 


ఐర్లాండ్ టీ20 సిరీస్ కు భారత జట్టు:  హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ), భువనేశ్వర్ కుమార్ ( వైస్ కెప్టెన్)  ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్