ప్రాక్టీస్ లో రోహిత్..శ్రీలంక సిరీస్ కు ఆడేనా?

ప్రాక్టీస్ లో రోహిత్..శ్రీలంక సిరీస్ కు ఆడేనా?

కెప్టెన్ రోహిత్ శర్మ  శ్రీలంక సిరీస్ కు అందుబాటులోకి వస్తడా? అసలు  బీసీసీఐ రోహిత్ ను ఎంపిక చేస్తుందా? అనే సస్పెన్స్ కు ఇంకా తెరపడటం లేదు.  జనవరి 3 నుంచి శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కోహ్లీ టీ20 ల నుంచి రెస్ట్ తీసుకుంటుండు. కేఎల్ రాహుల్ తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడే సమయంలో గాయపడ్డ రోహిత్... గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. తను ప్రాక్టీస్‌లోకి దిగినట్లు రోహిత్  తన ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలు షేర్ చేశాడు. దీంతో తన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

అయితే శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం రెండు బృందాలను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. మరో వైపు బీసీసీఐ వర్గాలు మాత్రం రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉంటున్నట్టు హింట్ ఇస్తున్నాయి. రోహిత్ ప్లేసులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తాడని చెప్పకనే చెబుతున్నాయి. మరి రోహిత్ టీ20లకు అందుబాటులోకి వస్తాడా? లేక వన్డేలకే వస్తాడా అన్నది వేచి చూడాలి.