దళితబంధు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన

దళితబంధు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో  దళితబంధు   అందించాలని  గురువారం కలెక్టరేట్  ఎదుట లబ్ధిదారులు ఆందోళన  చేశారు. గత ప్రభుత్వం  2వ విడతలో 2892 మంది అర్హులైన లబ్ధిదారులను  ఎంపిక చేసి క్షేత్ర స్థాయిలో విచారణ పూర్తి చేశారన్నారు.  

నిధుల విడుదల సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో  విడుదల ఆగిపోయిందని తెలిపారు.  వెంటనే దళితబంధు నిధులను విడుదల చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ కు లబ్దిదారులు వినతి పత్రం అందజేశారు.