
ఓ పరువు నష్టం దావా కేసులో మాజీ ప్రధాని దేవేగౌడకు కోర్టు భారీ జరిమానా విధించింది. పిటిషనర్కు రూ. 2 కోట్లు చెల్లించాలని బెంగళూరు కోర్టు తీర్పునిచ్చింది. దేవేగౌడ జూన్ 28, 2011లో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ కంపెనీ.. తమ సంస్థ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ కోర్టులో పిటిషన్ వేసింది. పరువు నష్టం కింద తమకు రూ. 10 కోట్లు చెల్లించాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ఆ కేసుకు సంబంధించి బెంగళూరు కోర్టు నేడు తీర్పును వెల్లడించింది.