
కుక్క మాంసం చట్టబద్ధం చేయాలని.. తన పిటిషన్ పై సంతకం చేయాలంటూ బెంగళూరులో ఓ కుర్రాడు చేస్తున్న డిమాండ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతడి డిమాండ్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. జంతు ప్రేమికులు,పెట్ లవర్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతగాడిని కొట్టేందుకు రెడీ అయ్యారు. అయితే అతను ఎందుకు అలా చేస్తున్నాడనే దాని వెనుక అసలు విషయం వేరే ఉంది.
మామూలుగా నాన్ వెజ్ తినొద్దని చెబితే ఎవరూ వినరు. కాదు కాదు పట్టించుకోరు కూడా. అయితే భిన్నంగా ఆలోచించిన ఆ కుర్రాడు కుక్క మాంసాన్ని చట్టబద్ధం చేయాలని. .తన పిటిషన్ పై సంతకం చేయాలంటూ ప్లకార్డు పట్టుకుని డిమాండ్ చేశాడు.
ఇంకేముంది జంతు ప్రేమికులు వెళ్లి ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. నేను శాఖాహారిని. చాలా మంది నాన్ వెజ్ టేరియన్స్ చిన్న చిన్న సంతోషాలకు మూగజీవాలను చంపి తింటారు. అలా చేయొద్దంటే ఎవరు వినరు. మీరు నిజంగా చికెన్ తినాలనుకుంటే కుక్క మాంసం ఎందుకు తినకూడదు. మీరు శాఖాహారిగా ఉండాలని నేను మాములుగా చెబితే వినేవారా? అందుకే ఇలా ప్లకార్డుతో డిమాండ్ చేసినట్లు చెప్పాడు.