తోటి ఉద్యోగిని గుండాలతో కొట్టించిన మరోఉద్యోగి..వీడియో వైరల్

తోటి ఉద్యోగిని గుండాలతో కొట్టించిన మరోఉద్యోగి..వీడియో వైరల్

ఎంత కోపం ఉంటే మాత్రం అంతలా ఇనుపరాడ్లతో కొడతారా..తోటి సహోద్యోగిని గొడ్డును బాదినట్లు బాదిన్రు..కిరాయి రౌడీలను పెట్టించి మరీ రక్తం వచ్చేలా తీవ్రం గా కొట్టారు. నడిరోడ్డుపై భారీ ట్రాఫిక్ లో..అందరూ చూస్తుండగా ఇనుపరాడ్డుతో అతనిపై దాడి చేస్తే.. గిలగిలా కొట్టుకున్నాడు..ఒక్కరూ కూడా అడ్డు చెప్పలేక పోయారు ..ఏంటీ దారుణం..బెంగళూరులో తోటి ఉద్యోగిని సహోద్యోగులు కిరాయి రౌడీలను పెట్టి కొట్టించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..సోషల్ మీడి యాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలేంటో తెలుసుకుందాం. 

ఈ షాకింగ్ ఘటనలో కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో ఆడిటర్ గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు బాధితుడి సహోద్యోగులు. వారిమధ్య అభిప్రాయ భేదాల మితిమీరిపోవడంతో గుండాలను పెట్టి కొట్టించారు. ఈ ఘటన బెంగళూరులో కళ్యాన్ నగర్ ప్రాంతంలో రద్దీగా ఉండే రింగ్ రోడ్డుపై జరిగింది. బాధితుడిని ఇనుపరాడ్డుతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్న దృశ్యాలు కారు డ్యాష్ కెమెరాలో బంధించి  సోషల్ మీడియాలో పెట్టారు వసీం అనే నెటిజన్.

ఐదుగురు నిందితుల్లో ఇద్దరు సురేష్ తోపాటు పనిచేసే ఆడిటర్లు ఉమాశంకర్, వినేష్ లుగా గుర్తించారు.వీరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ తోపాటు వీరిద్దరు ఒకే సంస్థలోపనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అభిప్రాయ భేదాల కారణంగా దాడి జరిగిందని చెప్పారు. సురేష్ తమపై చాలా ఒత్తిడి తెచ్చేవాడని విచారణలో ఉమాశంకర్, వినేష్ లు చెప్పారని పోలీసులు వెల్లడించారు. 

ఉమాశంకర్, వినేష్ లు విధుల పట్ల నిర్లక్ష్యం, బ్యాలెన్స్ క్లియర్ చేయడంతో నిర్లక్ష్యంగా ఉంటారని కంపెనీ సీనియర్లకు సురేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై చర్య లు చేపట్టారు కంపెనీ సీనియర్లు. దీంతో సురేష్ పై మరికొంతమందితో కలిసి రోడ్డుపై దారుణంగా కొట్టారు. ఈ వైరల్ వీడియోను చూసిన పెన్నూర్ పోలీసు ఉన్నతాధికారులు .. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.