
ఆటో, క్యాబ్ డ్రైవర్లు సామాన్యులను దోచుకు తింటున్నారు. అత్యవసర ప్రయాణాలను క్యాష్ చేసుకుంటూ సామాన్యుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు దోపిడి చేస్తున్నారు. ఓలా, ఉబర్, ఇతర సంస్థల వాహనాల డ్రైవర్లు అతి తెలివితో సామాన్యుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా బెంగుళూరు నగరంలో ఓలా ఆటో డ్రైవర్ కస్టమర్ ను బురిడి కొట్టించి ఎక్స్ ట్రా మనీ ఇవ్వమని అడిగాడు.
రైడ్ క్యాన్సిల్ చేసి..ఎక్స్ ట్రా మనీ..
బెంగళూరులో ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి నగరంలో ఓ ప్రదేశానికి వెళ్లడానికి ఓలా ఆటో బుక్ చేసుకున్నాడు. రైడ్ ను కన్ఫర్మ్ చేసిన ఆటో డ్రైవర్ ప్రశాంత్ యాదవ్ ను పికప్ చేసుకోవడాని పికప్ పాయింట్ కు వచ్చాడు. పికప్ పాయింట్ కు ఆటో డ్రైవర్ చేరుకోగానే డ్రైవర్ ఆ రైడ్ ను రద్దు చేశాడు. అనంతరం ప్రశాంత్ యాదవ్ తో ఆటో డ్రైవర్ బేరాలు ఆడాడు. ఆటో బుక్ చేసిన సమయంలో చూపెట్టిన మనీ కంటే..అదనంగా రూ. 100 అడిగాడు. ఈ విషయాన్ని బాధితుడు ప్రశాంత్ యాదవ్ ట్విట్టర్ లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది.
తాను బెంగళూరు స్టేషన్కు ఎలా చేరుకున్నానో..ఆ తర్వాత తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఓలా ఆటోను ఎలా బుక్ చేసుకున్నానో యాదవ్ పూస గుచ్చినట్లు వివరించాడు. “బెంగుళూరు సిటీ స్టేషన్లో దిగి..అక్కడ ఓలా ఆటో బుక్ చేశా. నా దగ్గరకు ఆటో డ్రైవర్ వచ్చాడు. ఆటో వాలా నన్ను తన దగ్గరికి పిలిచాడు. ఆటోను రద్దు చేసి..ఫిర్ జౌంగాకు వెళ్లడానికి ఓలాలో చూపెట్టిన నగదు కంటే రూ. 100 ఎక్స్ట్రా ఇవ్వండి సార్ అన్నాడు...అని బాధితుడు ప్రశాంత్ యాదవ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. దీనికి బెంగుళూరులో నివసించే ప్రతీ ఒక్కరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పరిగణిస్తే ఎలా..ఇక్కడ మధ్యతరగతి ఎలా జీవిస్తున్నారో అని ఆశ్చర్యపోతున్నాను" అని ప్రశాంత్ యాదవ్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ వైరల్ అయింది. పోస్ట్ను దాదాపు 60 వేల మంది వీక్షించారు. లక్షల సంఖ్యలో కామెంట్స్ చేశారు.