నిద్ర లేచింది మహిళా లోకం.. చీర కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు

నిద్ర లేచింది మహిళా లోకం..  చీర కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు

చీరల  కోసం మహిళలు కొట్టుకోవడం కొత్త విషయం కాకపోవచ్చు కానీ అది  ఎప్పుడైనా వినడానికి చూడటానికి  ఇంట్రెస్టి్ంగ్ గానే ఉంటుంది. తాజాగా ఓ ఇద్దరు మహిళలు షాపింగ్ కోసం వచ్చి ఒకే చీర కోసం కొట్టుకున్నారు. మళ్లీ అలా ఇలా కాదు జుట్లు పట్టుకుని మరీ..  ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  

సహజంగానే చీరలంటే అంటే మహిళలకు చాలా ఇష్టం. అందులోనూ డిస్కౌంట్‌లో చీరలు వస్తున్నాయంటే ఇకేంముంది .. అది ఎక్కడున్న సరే వెళ్లాల్సిందే.. ఎంతమంది ఉన్న సరే అక్కడినుంచి చీరలు తెచ్చుకోవాల్సిందే. తాజాగా బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్‌ శారీ సెంటర్‌ కూడా ఇటీవల డిస్కౌంట్‌ ధరలతో ఇయర్లీ శారీ సేల్‌ నిర్వహించింది. 

బయట మార్కెట్ కంటే తక్కువ ధర ఉండటం,చీరలు కూడా  బాగుండటంతో  చీరలను కొనుగోలు చేసేందుకు భారీగానే మహిళలు వచ్చారు.  భారీగా మహిళలు వస్తారని ముందుగానే ఊహించిన షాపు యజమానులు పోలుసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు.  అయితే షాపింగ్ కు వచ్చిన ఓ  ఇద్దరు మహిళలకు ఒకే చీర  నచ్చింది. 

దీంతో అది నాకు కావాలంటే నాకే  కావాలని అంటూ పంతం పట్టారు. ఈ విషయంలో తగ్గదేలే అన్నట్టుగా ఇద్దరూ వ్యవహరించారు. చివరికి ఇద్దరి మధ్య గొడవ మరింతగా ముదరడంతో జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు. మధ్యలో పోలీసులు కలగజేసుకుని గొడవను ఆపారు.  షాపింగ్ కోసం వచ్చిన  మిగతా మహిళలు వీరిని చూస్తుండి  పోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

https://twitter.com/rvaidya2000/status/1649996551174098945

 ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.  ఒక్క చీర కోసం ఎంతకైనా తెగిస్తారా బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు.  మహిళలు భారీ సంఖ్యలో ఎలాగూ వస్తారు కాబట్టి అన్ లైన్ లోనే ఆఫర్లు పెట్టొచ్చు కదా అని మరి కొంతమంది సలహా ఇస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే తమ షాపులో చీరలకు ఎంత డిమాండ్ వుందో చెప్పేందుకే ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రకటనగా రిలీజ్ చేసి ఉంటారు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.