పునేలో హత్యాచారానికి గురైన టెకీ భర్త
పుణే: హైదరాబాద్లో జరిగిన ఎన్కౌంటర్పై పుణే టెకీ భర్త హర్షం వ్యక్తం చేశారు. “ఆడవారి పై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడాలనుకునే వారికి ఈ చర్య స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. హైదరాబాద్ పోలీసులకు కంగ్రాట్స్. ఈ విషయంలో మాకు ఇంకా న్యాయం జరగలేదు ” అని హత్యచార బాధితురాలి భర్త చెప్పారు. 2009 అక్టోబర్ 7న పునేలోని ఖరాదీ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను యోగేశ్ రౌత్, మహేశ్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు రేప్ చేసి హత్య చేశారు. లోకల్ కోర్టు వారికి ఉరిశిక్ష విధించగా బాంబే హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది.