
బెంగళూరులో బంద్ డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు.. స్థానిక హోటల్ సరఫరా చేసిన ఆహార ప్యాకెట్లో చనిపోయిన ఎలుక రావడం చూసి షాక్ అయ్యాడు. అనంతరం ఆ ఫుడ్ ను సప్లై చేసిన వారిపై విద్యారణ్యపుర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. స్థానిక హోటల్ నుంచి మొత్తం 180 ఫుడ్ ప్యాకెట్లను అందించి విధుల్లో ఉన్న అధికారులకు పంపిణీ చేశారని పోలీసులు తెలిపారు.
“యశ్వంత్పూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోని సిబ్బంది బంద్ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులకు పంపిణీ చేసిన ఆహారంలో ఎలుకను కనుగొన్నారు. 180 మంది ట్రాఫిక్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆహారాన్ని తయారు చేయడానికి స్థానిక హోటల్తో ఒప్పందం కుదుర్చుకున్నారని, అది ఉదయం 7.30 గంటలకు పంపిణీ చేశారని దర్యాప్తులో తేలింది. ఆహారంలో ఎలుక కనిపించడంతో, అధికారి వెంటనే వాట్సాప్ గ్రూప్లో తన సహచరులను అప్రమత్తం చేశారు. దీంతో ఎవరూ ఆహారం తీసుకోలేదు" అని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ చెప్పారు.
Also Read :- IT Raids: ఐ ఫోన్ డీలర్లపై IT రైడ్స్
పోలీసుల కోసం ఆహారం సిద్ధం చేయడానికి హోటల్కు కాంట్రాక్ట్ ఇచ్చిన పోలీసు అధికారిపై కూడా విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.