బైక్ టాక్సీల బ్యాన్.. ట్రాఫిన్ నరకంలో బెంగళూరు సిటీ..!!

బైక్ టాక్సీల బ్యాన్.. ట్రాఫిన్ నరకంలో బెంగళూరు సిటీ..!!

Bengaluru Traffic: బెంగళూరు ప్రభుత్వం గతవారం దేశంలో బైక్ టాక్సీ సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత వాహనాలను వైట్ నంబర్ ప్లేట్ కింద పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం వాడటం సరికాదని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఉబెర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు నగరంలో ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చేసిందని బెంగళూరు సిటీ వాసులు చెబుతున్నారు. రోజులో గంటలతరబడి ట్రాఫిక్ లో నిలిచిపోవటం కష్టంగా ఉంటోందని వారు చెబుతున్నారు. బైక్ టాక్సీలను జూన్ 16ను నిలిపివేసినప్పటి నుంచి బెంగళూరు రోడ్లు 18 శాతం అధికంగా రద్దీగా మారాయని నెథర్లాండ్ టెక్నాలజీ సంస్థ నివేదిక వెల్లడించింది. ఉదయం 7 గంటల సమయంలో రోడ్లపై ట్రాఫిక్ గతంలో 59 శాతం నుంచి ప్రస్తుతం 77 శాతానికి పెరిగిపోయిందని వెల్లడించింది. దీంతో రోడ్లు 60 శాతం నుంచి ఒక్కసారిగా 83 శాతం కిక్కిరిసాయని చెప్పింది.

ALSO READ | Railway News: రైలు ప్రయాణికులపై ఛార్జీల మోత.. జూలై 1 నుంచి టిక్కెట్ ధరల పెంపు..!!

మరోపక్క బైక్ టాక్సీల బ్యాన్ కారణంగా ఆటోవాలాలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో అడిగినంత ఇస్తేనే వస్తామని డ్రైవర్లు తెగేసి చెబుతున్నారు. పైగా టూవీలర్లు నిలిచిపోవటంతో ఆటోలు రోడ్లపైకి రావటం ప్రయాణ కాలాన్ని పెంచేస్తూ, ట్రాఫిక్ కష్టాలను పెంచుతోందని రిపోర్ట్ వెల్లడించింది. ఈక్రమంలో బైక్ టాక్సీ రైడర్లు ప్రభుత్వం ప్రకటించిన బ్యాన్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. తమ ఆదాయం కోల్పోతున్నామని, తమకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఆటోవాలాల చేతివాటాన్ని ఇరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. గడచిన 48 గంటల సమయంలో దాదాపు వెయ్యి కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. గతంలో బైక్ టాక్సీల వల్ల తమకు గిరాకీలు లేక ఇబ్బందులు పడినట్లు చెప్పిన ఆటోవాలాలు ప్రస్తుతం ఇలా ప్రవర్తించటంపై అధికారులు సీరియస్ అవుతున్నారు. ప్రభుత్వం కూడా కనీస ఆటో రవాణా ఛార్జీల విషయంలో చర్యలు తీసుకుని దానిని రెండు కిలోమీటర్ల దూరానికి బేస్ ఫేర్ రూ.35కి మార్చాలని చాలా మంది కోరుతున్నారు.