
నేను, నా ఫ్యామిలీ’ అని ఆలోచించేవాళ్లే ఎక్కువ. ‘నాతోపాటు సొసైటీ కూడా’ అనేవాళ్లు చాలా తక్కువ. కానీ అరవై ఏళ్ల కల్పన మాల్యా అలా కాదు. పేద పిల్లలే తన పిల్లలుగా, వాళ్ల బాగోగులే తన బాగోగులుగా భావిస్తోంది. పేదరికం కారణంగా చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పిస్తోందీమె.
నాది మధ్య తరగతి కుటుంబం. మా పేరెంట్స్ చదువుకునే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చదువంతా దాతల సాయంతోనే సాగింది. వాళ్లకు చదువు విలువ తెలుసు కాబట్టే, నన్ను ఇంజినీరింగ్ వరకు చదివించారు. వాళ్ల స్ఫూర్తితో నావంతుగా ఏదైనా చేయాలనుకున్నా. పిల్లల కోసం ఫౌండేషన్ మొదలుపెట్టాలనుకున్నా. కానీ ఎలా మొదలుపెట్టాలో అర్థం కాకపోయేది.
విద్యాదాన్
పేద పిల్లల కోసం ఏదైనా చేస్తే బాగుంటుందనే విషయాన్ని నా భర్తతో చెప్పాను. అప్పుడు ఆయన ఫిలాంత్రఫిక్ ఫౌండేషన్ (విద్యాదాన్ ప్రోగ్రామ్) గురించి చెప్పారు. నేను అందులో భాగం కావాలనుకున్నా. ఐటీ కంపెనీకి చెందిన శిబూలాల్ ఫ్యామిలీ ఆ ఫౌండేషన్ నడుపుతోంది. 2015లో మొదటిసారి దీంతో కలిసి అడుగేశా. ‘విద్యాదాన్’లో భాగంగా మొదటిసారి ఒక అమ్మాయికి స్కాలర్ఫిష్ ఇచ్చా. ఐదేళ్లలో ఆ సంఖ్య పెరుగుతూపోయింది.
ఇతరుల సాయంతో..
ఎక్కడైతే బేసిక్ ఎడ్యుకేషన్ అందక, ఇబ్బందులు పడతారో, అక్కడికి వెళ్లేదాన్ని. వాళ్ల వివరాలు తెలుసుకొని, ట్విట్టర్లో పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టును చూసి చాలామంది డబ్బు సాయం చేసేందుకు ముందుకొచ్చేవాళ్లు. ప్రతి పైసా స్టూడెంట్స్కు అందేలా, బ్యాంక్ అకౌంట్ నంబర్ జతపర్చేదాన్ని. స్టూడెంట్ అకడమిక్ ఇయర్కు సరిపోయే డబ్బు పోగు చేశాకే హెల్ప్ చేస్తాం. సంవత్సరానికి ఒక్కో స్టూడెంట్కు పది వేల నుంచి పన్నెండు వేలు ఖర్చు చేస్తాం. ఆ తర్వాత కూడా పెద్ద చదువులు చదివేందుకు బాధ్యత తీసుకుంటాం.
ఐదేళ్లలో 3,500 మందికి విద్యాదానం చేశాం. ఫౌండేషన్ సాయంతో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, నర్సింగ్, ఫార్మసీ లాంటి పెద్ద చదువులు చదివినవాళ్లు ఉన్నారు. ఒక స్టూడెంట్ బాధ్యత తీసుకుంటే, కెరీర్లో సెటిల్ అయ్యే వరకూ సాయం అందుతూనే ఉంటుంది. ఫౌండేషన్ సేవలు ఒక్క రాష్ర్టానికే పరిమితం కాకుండా, దేశంమొత్తం విస్తరించాం. పది రాష్ర్టాలు కలుపుకొని లక్షకుపైగా స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇచ్చాం. బెంగళూరు కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేశా”అని ఫౌండేషన్ గురించి చెప్పింది కల్పన మాల్యా.