
ఒకటా రెండా.. వరుసగా ఆరు ఓటములు. ప్రత్యర్థులే పాపం అనేలా పరాజయాల పరంపర. ఇంకెప్పుడు గెలుస్తా రంటూ అభిమానుల ప్రశ్నలు. జాతీయ జట్టు కుతిరుగులేని సారథిగా ఉన్న విరాట్ కోహ్లీకి అసలు జట్టును నడిపించడమే రానొట్టుంది అంటూ విమర్శకుల ఎత్తిపొడుపు మాటలు. ఇలాంటి పరిస్థితిలో బెంగళూరుసమష్టిగా రాణించింది. క్రిస్ గేల్ చెలరేగినా.. మిడిల్ ఓవర్లలో పుంజుకున్న బౌలర్లు ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా అడ్డు కుంటే.. కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ హాఫ్సెంచరీలతో సత్తా చాటారు. దాంతో, కింగ్స్ లెవెన్ పంజాబ్ ను ఓడించిన కోహ్లీసేన ఈ సీజన్ లో బోణీ కొట్టి ఊపిరిపీల్చుకుంది
మొహాలి: ఐపీఎల్ పన్నెండో సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఖాతా తెరిచింది.వరుసగా ఆరు ఓటముల తర్వాత ఏడో మ్యాచ్ లోగెలుపు రుచి చూసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (53బంతుల్లో 8 ఫోర్లతో 67), సౌతాఫ్రికా సూపర్ స్టార్ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో59 నాటౌట్ ) సత్తా చాటడంతో శనివారం రాత్రిజరిగిన మ్యాచ్ లో చాలెంజర్స్ ఎనిమిది వికెట్లతేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది. పరుగు తేడాతో సెంచరీ కోల్పోయిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 నాటౌట్ )విజృంభించినా.. బౌలర్లు చేతులెత్తే యడంతో పంజాబ్ కు మరో ఓటమి తప్పలేదు. గేల్ మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ లెవెన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 173 పరుగులుచేసింది. బెంగళూరు బౌలర్లలో చహల్ (2/33)రెం డు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ (4–0–19–1) చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు.అనంతరం కోహ్లీ, ఏబీ రాణించడంతో బెంగళూరు19.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 174 రన్స్చేసి విజయం సాధించింది. మార్కస్ స్టొయిని స్ (16బంతుల్లో 4 ఫోర్లతో 28 నాటౌట్ ) కూడా సత్తాచాటాడు.
అటు కోహ్లీ … ఇటు ఏబీ
ఎలాగైన గెలవాలన్న కసితో బరిలోకి దిగినబెంగళూరు ఛేజింగ్ ను మెరుపు వేగంతో మొదలుపెట్టింది. ఇన్నింగ్స్ తొలి బంతినే క్లాసిక్ షాట్ తోబౌండ్రీకి చేర్చిన పార్థివ్ పటేల్ (9 బంతుల్లో 4ఫోర్లతో 19) ఉన్నంత సేపు మెరుపు షాట్లు ఆడాడు.మరో ఎండ్ లో షమీ బౌలింగ్ లో తన ట్రేడ్ మార్క్ స్ట్రెయిట్ డ్రైవ్ తో తొలి బౌండ్రీ కొట్టిన విరాట్ కూడా ధాటిగా ఆడాడు. నాలుగో ఓవర్లో పార్థివ్ ను ఔట్చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అయితే,అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీకి డివిలియర్స్ జతకలిశాడు. ఏబీ స్ట్రయిక్ రొటేట్ చేస్తూసహకారం అందించగా.. కోహ్లీ క్లాసిక్ షాట్లతోబౌండ్రీలు రాబడుతూ టార్గెట్ ను కరిగించాడు.ఈ క్రమంలో అతను 37 బంతుల్లో నే హాఫ్ సెంచరీపూర్తి చేసుకోగా.. 12వ ఓవర్లో బెంగళూరు స్కోరువంద దాటింది. ఈ లెక్కన బెంగళూరు ఈజీగానేగెలిచేలా కనిపించింది. కానీ, 16వ ఓవర్లో కోహ్లీనిఔట్ చేసిన షమీ ఆ జట్టును దెబ్బకొట్టాడు. చివరిమూడు ఓవర్లలో ఆర్ సీ బీకి 38 రన్స్ అవసరమవడంతో ఆ జట్టు శిబిరంలో టెన్షన్ నెలకొంది . ఈ దశలోఆండ్రూ టై వేసిన 18వ ఓవర్లో రెం డు ఫోర్లు, సిక్సర్కొట్టిన మార్కస్ స్టొయినిస్ ఒత్తిడి తగ్గించాడు. షమీబౌలింగ్ లో స్టొయిని స్ బౌండ్రీ, డివిలియర్స్ సిక్సర్రాబట్టడంతో మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లో కి వచ్చేసింది.ఆఖరి ఓవర్లో ఆరు రన్స్ అవసరం అవగా.. తొలిబాల్కు ఫోర్, రెండో బాల్కు డబుల్ తీసిన స్టొయినిస్ బెంగళూరును గెలిపించాడు.
గేల్ ఒక్కడే..
పంజాబ్ ఇన్నింగ్స్లో హీరో క్రిస్ గేలే. మిగతాబ్యాట్స్ మెన్ విఫలమైనా.. అతనొక్కడే ఇన్నింగ్స్ ను నడిపించాడు. సాధారణంగా మొదట్లో నెమ్మదిగాఆడి ఆఖర్లో రెచ్చి పోయే కరీబియన్ వీరుడు ఈ సారితనలోని మరో కోణాన్ని చూపించాడు. పరిస్థితులకు తగ్గట్టు గేర్లు మారుస్తూ పర్ ఫెక్ట్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్లెవెన్ ఇన్నింగ్స్ కాస్త నిదానంగానే మొదలైంది . తొలి ఎనిమిది బంతుల్లో ఒక్క పరుగే చేసిన గేల్.. నవ్దీ ప్ సైనీ బౌలింగ్ లో స్క్వేర్ లెగ్ మీదుగా ఫోర్ కొట్టిబౌండ్రీల ఖాతా తెరిచాడు. ఉమేశ్ యాదవ్ వేసినమూడో ఓవర్లో వరుసగా 4,6తో ఊపులోకొచ్చాడు.ఆపై, సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 24 రన్స్వచ్చాయి . పవర్ ప్లే తర్వాతి బాల్కు సిక్సర్ కొట్టినలోకేశ్ రాహుల్.. చహల్ బౌలింగ్ లో మరో షాట్ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్(15)ను క్లీన్ బౌల్డ్ చేసిన చహల్ పంజాబ్ కు షాకిచ్చాడు. ఈ దశలో చహల్తో పాటు, మొయిన్ అలీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. ఒక దశలో 23 బంతుల్లో ఒక్క బౌండ్రీ మాత్రమేవచ్చింది. వేగం పెంచే క్రమంలో సిరాజ్ బౌలింగ్ లోర్యాంప్ షాట్ తో సిక్సర్ కొట్టిన సర్ఫరాజ్ ఖాన్(15) తర్వాతి బాల్కే కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు.ఆ వెంటనే సామ్ కరాన్ (1)ను మొయిన్అలీ ఎల్బీగా ఔట్ చేసి బెంగళూరుశిబిరంలో జోష్ నింపాడు. అప్పటి-కి 14 ఓవర్లలో పంజాబ్స్కోరు 114/4. తొలిస్పెల్లో విఫలమైన సిరాజ్తో పాటు నవ్దీప్ సైనీపొదుపుగా బౌలింగ్ చేయడంతో గేల్, మన్ దీప్సింగ్ (18 నాటౌట్ ) షాట్లు ఆడలేక పోయారు.ఉమేశ్ వేసిన 19వ ఓవర్లో ఫోర్ , సిక్సర్ కొట్టిన గేల్ 90లోకి వచ్చాడు. తన సెంచరీకి చివరి ఓవర్లో పది పరుగులు అవసరమగా.. సిరాజ్ బౌలింగ్లో రెండుఫోర్లు కొట్టిన గేల్ 99 రన్స్ తో నిలిచిపోయాడు.
స్కోరు వివరాలు
పంజా బ్: రాహుల్ (స్టంప్డ్) పార్థివ్ (బి)చహల్ 18, గేల్ (నాటౌట్ ) 99, మాయాంక్(బి) చహల్ 15, సర్ఫరాజ్ (సి) పార్థీవ్ (బి)సిరాజ్ 15, కరన్ (ఎల్బీ) మొయిన్ 1,మన్ దీ ప్ (నాటౌట్ ) 18, ఎక్స్ ట్రాలు: 7;మొత్తం: 20 ఓవర్లలో 173/4;
వికెట్ల పతనం:1–66, 2–86, 3–110, 4–113.
బౌలింగ్ :ఉమేశ్ 4–0–42–0, సైనీ 4–0–23–0,సిరాజ్ 4–0–54–1, చహల్ 4–0–33–2,మొయిన్ 4–0–19–1.బెంగళూరు: పార్థివ్ (సి) మయాంక్ (బి)అశ్విన్ 19, విరాట్ (సి) మురుగన్(బి) షమి67, డివిలియర్స్ (నాటౌట్ ) 59, స్టొయినిస్(నాటౌట్ ) 28, ఎక్స్ ట్రా: 1, మొత్తం: 19.2ఓవర్లలో 174/2.
వికెట్ల పతనం:1–43, 2– 128, బౌలింగ్ : కరన్3–0–3–01, షమి 4–0–43–1,అశ్విన్ 4–030–1, మురుగన్4–0–24–0, టై 40–40–0, సర్ఫరాజ్ 0.2–0–6–2