భాయ్ దూజ్ 2025: అక్టోబర్ 23 అక్కా తమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్ల పండుగ.. ఆరోజు ఏం చేయాలంటే..!

భాయ్ దూజ్ 2025:  అక్టోబర్ 23 అక్కా తమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్ల పండుగ..  ఆరోజు ఏం చేయాలంటే..!

  భాయ్ దూజ్ పండుగ సోదరులు ...  సోదరీమణుల మధ్య ఆప్యాయత .. రక్షణను సూచించే పండుగ.  ఈ ఏడాది ( 2025) అక్టోబర్ 23న భాయ్ దూజ్ పండుగను జరుపుకోనున్నారు. ఈరోజు సోదరి తన సోదరుడికి భోజనం పెడుతుంది. తన నుదుట తిలకం వేసి అన్న ఆశీర్వాదాలు తీసుకుంటుంది. భాయ్​ పూజ  శుభ సమయం, పూజా విధానం.. తిలకం వేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం  ... భాయ్​ దూజ్​ ప్రాముఖ్యత గురించి  తెలుసుకుందాం.

దీపావళి పండుగ సంబరాలు  ఈ ఏడాది ( 2025)  అక్టోబర్​ 23  న  భాయ్ దూజ్ వేడుకతో ముగుస్తాయి.   సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా ఈ పండుగ జరుపుకుంటారు. భారతదేశంలో  భాయ్ దూజ్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, పవిత్ర సంబంధాన్ని సూచించే ముఖ్యమైన పండుగ.  సోదరులు, సోదరీమణులు సాంప్రదాయ పద్ధతిలో ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటారు. 

కార్తీకమాసం శుక్ల పక్షం ద్వితీయ తిథి  అంటే విదియ రోజు   జరుపుకుంటాం.  పంచాగం ప్రకారం ఈ ఏడాది ( 2025)  భాయ్ దూజ్..  గురువారం, అక్టోబర్ 23  జరుపుకుంటారు.  
  

  • కార్తీకమాసం విదియ తిథి ప్రారంభం : అక్టోబర్​ 22 రాత్రి 8.16 గంటలకు
  • కార్తీకమాసం విదియ తిథి ముగింపు :  అక్టోబర్​ 23 రాత్రి 10.46  గంటలకు
  • భాయ్ దూజ్ శుభ సమయం (అపరాహ్ణ ముహూర్తం) : అక్టోబర్​ 23 మధ్యాహ్నం 1:24 నుంచి  3:41 వరకు (  2 గంటల 17 నిమిషాలు)  వ్యవధి.

పూజా విధానం 

ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం వెలిగించాలి. విష్ణువు, వినాయకుడిని పూజించాలి. ఈరోజు సోదరుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. దీన్ని భగినీ హస్త భోజనం అంటారు. నుదుటున బొట్టు పెట్టి  హారతి ఇవ్వాలి. భాయ్ దూజ్ రోజున ( 2025 అక్టోబర్​)​ 23 సోదరి తన కుడిచేతి ఉంగరం వేలితో సోదరుడికి తిలకం పెట్టాలి. ఇలా చేసేటప్పుడు సోదరుడు తన ముఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. చేతికి రక్షా దారం కట్టి మిఠాయిలు తినిపించాలి. అనంతరం సోదరిని సంతోషంగా ఉండమని దీవిస్తూ వారికి బహుమతులు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. 

భాయ్ దూజ్ ప్రాముఖ్యత

కార్తీకమాసం శుక్ల పక్షం విదియ రోజున   యమున తన సోదరుడిని ఇంటికి ఆహ్వానించి గౌరవించి ఆహారాన్ని వండిపెట్టింది. అందువల్ల ఈరోజు యమునా నదిలో స్నానం చేసి యముడిని ఆరాధించే వ్యక్తి మరణం తర్వాత యమలోకానికి వెళ్లాల్సిన అవసరం లేదు. సూర్యుడి కుమార్తె యమునను సకల బాధలు తొలగించేదిగా భావిస్తారు. అందుకే ఈరోజు యముడిని, యమునా దేవిని పూజించడం వల్ల  ఆశించిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. 

నుదుట తిలకం దిద్దుటప్పుడు చదవాల్సిన మంత్రం 


గంగా పూజ్యేమునా కో యమీ పూజ్యోమరాజ్ కో సుభద్ర పూజా కృష్ణ కో గంగా యమునా నీర్ బహో మేరే భాయ్ కీ ఆయు బఠో 

Disclaimer:పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాలు.. పండితుల సలహాలతో పాటు  ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.