
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్-, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 17.
పోస్టుల సంఖ్య: 67.
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్– 62, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 05.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, బీఎస్సీ, ఎం.టెక్/ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 32 ఏండ్లు, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 02.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 17.
అప్లికేషన్ ఫీజు: ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ (ఎఫ్ఓఈ) పోస్టులకు రూ.450. ప్రాజెక్ట్ ఇంజినీర్– పోస్టులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీని కేటాయించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్లో సంప్రదించగలరు.