
కూకట్పల్లి పరిధిలోని భరత్నగర్కాలనీ పోచమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలకు రావాలని కోరుతూ మంత్రి వివేక్వెంకటస్వామికి శుక్రవారం నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆదివారం జరుగనున్న బోనాల పండుగకు హాజరు కావాలని కోరారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పట్లోళ్ల నాగిరెడ్డి, వెంకటేశ్యాదవ్, భిక్షపతిగౌడ్ ఉన్నారు.