బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఏడవ వారం నామినేషన్స్ చాలా హీటెక్కించాయి. ఒకరిపై ఒకరి నామినేషన్స్ పాయింట్స్ చెప్పుకుంటూ రెచ్చిపోయారు. అందులో మరీ ముఖ్యంగా ప్రియాంక(Priyanka), శోభా శెట్టి(Shobha shetty), భోలే శావళి(Bhole shavali) మధ్య బీభత్సమైన వాదన జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు చాలా మాటలు అనుకున్నారు. భోలే బూతు మాటలు అంటున్నారని ప్రియాంక బిగ్ బాస్ కు కంప్లైంట్ చేసింది. భోలే కూడా పలుమార్లు ఆడవాల్లైపోయారు లేకపోతె వేరేలా ఉండేది అన్నాడు. దాంతో సహనం కోల్పోయిన ప్రియాంక భోలేను ఉద్దేశిస్తూ.. థూ అంటూ ఊసింది. ప్రియాంక చేసిన ఈ పనికి ఆడియన్స్ తోపాటు, కంటెస్టెంట్స్ కూడా షాకయ్యారు.
ఇక ఇదే విషయంపై తాజాగా భోలే శావళి తల్లి, చెల్లి స్పందించారు. భోలే గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముందుగా భోలే తల్లి మాట్లాడుతూ.. మంచి మనసున్న వ్యక్తి నా కొడుకు. ప్రియాంక నా కొడుకును థూ అని ఎందుకు అన్నదో నాకు అర్థం కావట్లేదు. అతడితో హౌస్లో ఎవరూ మాట్లాడటం లేదు. తను కలుపుకుపోదామని చూస్తున్నా.. కావాలనే దూరం పెడుతున్నారు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ.
ALSO READ : ఫ్యామిలీ స్టార్ మృణాల్ను .. SVP కీర్తిసురేష్ తో లింక్..ఎందుకో తెలుసా?
ఆతరువాత భోలే చెల్లి మాట్లాడుతూ.. అందరినీ ప్రేమించే గుణం మా అన్నయ్యది. తన మంచితనాన్ని ఓర్వలేకపోతున్నారు. మా అన్నయ్యకు అతిగా మాట్లాడటం, నటించడం రాదు. కావాలనే సీరియల్ బ్యాచ్ మా అన్నయ్యను టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక థూ.. ఊసేంత పెద్ద తప్పు మా అన్నయ్య ఎం చేశాడు. అవి చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. శోభా, ప్రియాంక ముందునుండి హౌస్లో ఆటిట్యూడ్ చూపిస్తున్నారు, ఓవరాక్షన్ చేస్తున్నారు. సీరియల్ నటులుగా వాళ్లకి ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ.. థూ అని ఊసేంత ఊయడం తప్పు. వాళ్లెన్ని మాటలన్నా.. మా అన్నయ్య మాత్రం కూల్గానే మాట్లాడాడు.. అంటూ ఫైర్ అయింది.