
వికారాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో నిర్మించే ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం భూమి పూజతో శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో రూ. 235 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణాలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. కాలేజీ ప్రిన్సిపల్, ఆర్ఎంఓ, సూపరింటెండెంట్ క్వార్టర్లు, హాస్టల్స్ నిర్మిస్తారని చెప్పారు.
ముందుగా స్పీకర్ కు కలెక్టర్ ప్రతీక్ జైన్ బొకే అందించి స్వాగతం పలికారు. ఎస్పీ నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, ఆర్అండ్ బీ ఎస్ఈ వసంత నాయక్, ఈఈ శ్రీధర్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపల్ పద్మ, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.