క్యాంప్‌‌లోనే భువనగిరి బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

క్యాంప్‌‌లోనే భువనగిరి బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు :  భువనగిరి బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు క్యాంప్‌‌లోనే కొనసాగుతున్నారు. మున్సిపల్​చైర్మన్​ఎనబోయిన ఆంజనేయులు, వైస్​ చైర్మన్​ చింతల కిష్టయ్యపై 16 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని గుంటూరుకు వెళ్లివచ్చిన వారు మంగళవారం ఉప్పల్‌‌లోని ఓ హోటల్లో క్యాంప్​ ఏర్పాటు చేసుకున్నారు. అవిశ్వాసం తీర్మానంపై బుధవారం కలెక్టర్​హనుమంతు జెండగేను కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  

ఇదిలా ఉండగా అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్​ కౌన్సిలర్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డిని ఫోన్​లో సంప్రదించి..  చైర్మన్​ విషయంలో పార్టీకి ఉన్న అవకాశాలను వివరించారు.  బుధవారం మరోసారి ఎమ్మెల్యేను కలువనున్నారు. కాగా, చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని సంప్రదించారని సమాచారం. పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటును వివరించగా..  తాను మాట్లాడుతానని  హామీ ఇచ్చినట్టు తెలిసింది.