
- భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి వెలుగు : పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ ను కలెక్టర్ హనుమంతరావుతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలపరుస్తుందని తెలిపారు.
కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు త్వరగా బేస్మెంట్ పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న సాయం పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, మండల స్పెషల్ ఆఫీసర్ సుభాషిని సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు .