బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి ఘటనలో ఇద్దరి అరెస్ట్

బిగ్ బాస్ సీజన్ 7  విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి ఘటనలో ఇద్దరి అరెస్ట్
  • మిగతా నిందితుల కోసం జూబ్లిహిల్స్ పోలీసులు గాలింపు

పంజాగుట్ట, వెలుగు :  బిగ్ బాస్ సీజన్ 7  విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్  ఫ్యాన్స్ మధ్య అత్యుత్సాహం కారణంగా  ఘర్షణ జరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేయగా.. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఆదేశాలను లెక్క చేయకుండా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను రెండోసారి ర్యాలీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు తీసుకొచ్చిన డ్రైవర్లు సాయి కిరణ్

రాజు అరెస్ట్ చేశారు. రూల్స్ అతిక్రమించి  రోడ్లపై కార్లను ఆపారు. దీంతో ఇరువర్గాల అభిమానులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడ్డారు. మిగతావారిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.