పాఠశాలకు వెళ్తున్న పడవ బోల్తా.. 18 మంది చిన్నారులు మిస్సింగ్

పాఠశాలకు వెళ్తున్న పడవ బోల్తా.. 18 మంది చిన్నారులు మిస్సింగ్

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పాఠశాలకు 34 మంది పిల్లలతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటన తర్వాత దాదాపు 18 మంది చిన్నారులు తప్పిపోయారని, వారు నీటిలో మునిగిపోయి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను రంగంలోకి దించారు. మధుపూర్ పట్టి ఘాట్ సమీపంలో బాగమతి నది ఒడ్డున ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లా మేజిస్ట్రేట్‌తో సహా సీనియర్ జిల్లా అధికారులను ప్రమాద స్థలానికి పంపామని, పిల్లల కుటుంబాలకు సహాయం, మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. "రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాలని నేను సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌ని కోరాను. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుంది" అని ఆయన చెప్పుకొచ్చారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుండి ఒక బృందం కూడా ఆన్-సైట్‌లో ఉంది. కాగా ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.