పది పార్టీల నేతలతో కూడిన అఖిల పక్షాన్ని కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఓకే అయిందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనగణన చేయాలన్న డిమాండ్ ప్రాధాన్యాన్ని వివరించేందుకు అఖిలపక్షంతో వచ్చి కలుస్తామని గతంలో ప్రధాని మోడీని కోరామని, దీనిపై స్పందించిన ఆయన సోమవారం కలిసేందుకు అంగీకరించారని నితీశ్ చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు అఖిలపక్షంతో వచ్చి కలవొచ్చని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాధానం వచ్చిందన్నారు. ‘‘దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసే పార్టీల నేతల వివరాలను ఇప్పటికే ఆయన ఆఫీస్కు పంపాను. కుల జనగణనపై ప్రధానితో జరిగే సమావేశంలో సానుకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నా” అని ఆయన అన్నారు. కేంద్రం తమ విజ్ఞప్తిని అంగీకరించి, దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కలు తీస్తే వెనుకబడిన వర్గాలకు మరింత మేలు జరుగుతుందని నితీశ్ అన్నారు. సోమవారం జరిగే ఈ సమావేశానికి బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ఆ రాష్ట్ర మంత్రి జానక్ రామ్, రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు.
అఖిలపక్ష నేతలకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్
- దేశం
- August 22, 2021
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ