పేకాటలో పందెంగా భార్య : మహాభారతంలో ధర్మరాజు..కలియుగంలో సోనూ

పేకాటలో పందెంగా భార్య :  మహాభారతంలో ధర్మరాజు..కలియుగంలో సోనూ

మహాభారతంలో ధర్మరాజు  చేసిన ఘనకార్యం మనందరికి తెలిసిందే. జూదం ఆడేందుకు భార్యను పందెంగా  పెట్టిన చరిత్రను చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. తాజాగా  బీహార్ బగల్ పూర్ కు చెందిన ధర్మరాజు కజిన్ బ్రదర్ లా ఉన్న సోనూ హరిజన్ అనే యువకుడు తాగుబోతు, జూదగాడు. ఓ రోజు సోనూ డబ్బులు లేకపోవడంతో భార్యను పందెంలో పెట్టి జూదం ఆడాడు. అందులో ఓడిపోయాడు. ముందుగానే ఒప్పొందం ప్రకారం జూదంలో ఓడిపోయినందుకు గాను సోనూ భార్యను తన స్నేహితులకు నెలరోజుల పాటు ఉంచేందుకు సిద్ధమయ్యాడు. అయితే నాలుగురోజుల పాటు స్నేహితుల చేతుల్లో శారీరకంగా చిత్రహింసలకు గురైన బాధితురాలు తట్టుకోలేక తిరిగి ఇంటికి వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త సోనూ నా పరువు పోయింది. నా మాట అంటే నీకు లెక్కలేదా..పందెం ప్రకారం నువ్వు నా స్నేహితుల వద్ద నెల రోజుల పాటు ఉండాలి అంటూ ఆదేశించారు. భార్య అందుకు ఒప్పుకోకపోవడంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. భర్త దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం బాధితురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారిస్తున్నారు.