- బైక్ను ఢీకొట్టిన కారు
- ఇద్దరు స్నేహితులు మృతి
- రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ పరిధిలో ఘటన
శంకర్ పల్లి, వెలుగు: బైక్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ పరిధిలో జరిగింది. శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామానికి చెందిన రాజు(40), శ్రీశైలం(32) ఇద్దరూ ఫ్రెండ్స్. బుధవారం ఉదయం 10 గంటలకు వీరిద్దరు బైక్ పై జన్వాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నారు. జన్వాడ గేటు సమీపంలో ఓవర్ స్పీడ్ తో ఎదురుగా వచ్చిన ఓ కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడ్డ శ్రీశైలంను దగ్గరలోని హాస్పిటల్ కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన కారు.. ఇక్ఫాయ్ కాలేజీకి చెందిన స్టూడెంట్ దని తెలుసుకున్న జన్వాడ గ్రామస్తులు, స్థానిక నేతలు కాలేజీ గేటు వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి పంపించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు ఫైల్ చేసి, ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.