
కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు అధికారులు. కొట్లాయం ప్రాంతంలోని మన్నార్ ఖడ్ ప్రాంతంలోని కోళ్లఫారాల్లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు 2024, మే 24వ తేదీన అధికారికంగా నిర్థారించారు అధికారులు. బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా వెంటనే చర్యలు చేపట్టారు కేరళ పశు సంవర్థక శాఖ అధికారులు. మన్నార్ ఖడ్ ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు రక్షణ చర్యలు చేపట్టారు.
ఆయా ప్రాంతాల్లోని కోళ్లఫారాల్లోని కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇదే సమయంలో కొట్టాయం ప్రాంతంలోని మన్నార్క్కాడ్, పుతుప్పల్లి పంచాయతీల పరిధిలో కోళ్లు, చికెన్, కోడి గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. అన్ని కోళ్లను చంపేయాలని కోళ్లఫారం యజమానులను ఆదేశించారు. ఈ రెండు పంచాయతీల పరిధిలో కోళ్లు, చికెన్, గుడ్లు, బాతులు, పక్షి మాంసాలపై నిషేధం విధించారు అధికారులు.
ప్రజలు ఎవరూ చికెన్ కొనుగోలు చేయొద్దని ఆదేశించారు. మన్నార్క్కాడ్ పంచాయతీలోని 12, 13, 14 వార్డులలో కోడి, బాతు, పిట్ట, ఇతర పెంపుడు పక్షుల గుడ్లు, మాంసం, ఎరువు అమ్మకం, దిగుమతి నిషేధించబడింది. 1 కి.మీ నుంచి 10 కి.మీ వరకు నిఘా జోన్ను ఏర్పాటు చేశారు అధికారులు.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బర్డ్ ఫ్లూ మొన్నటి వరకు వాట్సాప్ లోనే చర్చనడుస్తుండేదని ఇప్పుడు ఏకంగా వచ్చేసిందని ఆశ్చర్యానికి గురవుతున్నారు నెటిజన్లు.