తెలంగాణ బాహుబలి కేసీఆర్..ఓర్వలేకనే బీజేపీ దాడి  

తెలంగాణ బాహుబలి కేసీఆర్..ఓర్వలేకనే బీజేపీ దాడి  
  • మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
     

వరంగల్ జిల్లా : సీఎం కేసీఆర్ తెలంగాణ బాహుబలి.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే బీజేపీ రాష్ట్రంపై దాడి చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. నిన్నటి బీజేపీ సభలో నాయకుల మాటలకు టీఆర్ఎస్ తరపున ఆయన కౌంటర్ ఇచ్చారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని ఈ సందర్భంగా కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. 
‘‘మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేదే..? గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ , కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..?  బీజేపీ తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటీ..?  బిడ్డా సంజయ్.. ఇది ఉద్యమాల గడ్డ, టీఆర్ఎస్ గడ్డా, ఖబడ్దార్.. కేసీఆర్ ను విమర్శించే అర్హత సంజయ్ కు లేదు.. మధ్యప్రదేశ్, అస్సాం సీఎంలకు మతి ఉందా..?  అభివృద్ధి సూచీలో మీరెక్కడున్నారో తెలుసా..?  ’ అంటూ కడియం శ్రీహరి ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోంది, ఇది ప్రమాదకకరమన్నారు. మతోన్మాదులకు తెలంగాణలో చోటు లేదన్నారు. బీజేపీ సీఎంలు, మంత్రులు, నాయకులు సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకున్న వారే ఇప్పుడు దూషిస్తున్నారని, బీజేపీ నాయకులు పగటివేషగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ బలహీన పడటంతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, బీజేపీది రాజకీయ దివాళకోరుతన అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 
కేంద్రానికి అన్ని సంస్థలను అమ్మడమే తెలుసు  చీఫ్ విప్ వినయ్ భాస్కర్ 
ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. మా దగ్దరి ఉద్యోగుల జీతాలు చూసి మాట్లాడాలని ఆయన సూచించారు. కేంద్రం అన్ని సంస్థలను అమ్ముకోవడమే తెలుసు అని ఆయన ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ ఏకం చేస్తారని, దానికి తెలంగాణ కేంద్రంగా ఉంటదని వినయ్ భాస్కర్ తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

ఏపీలో 2వేలకు కొని సిటీలో 10వేలకు అమ్ముతున్రు

మోడీ కాన్వాయ్ను అడ్డుకున్న చోటు.. పాక్ బార్డర్కు 15 కిలోమీటర్లే

టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు