మిషన్ 90 : నేతలకు బి.ఎల్ సంతోష్ దిశానిర్దేశం

మిషన్ 90 : నేతలకు బి.ఎల్ సంతోష్ దిశానిర్దేశం

దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఫుల్ టైమర్స్ మీటింగ్ రెండో రోజు కొనసాగుతోంది. శామీర్ పేటలోని ఓ రిసార్ట్ లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ఇంచార్జీలు, విస్తారక్ లు, పాలక్ లతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యచరణపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబపాలన గురించి ప్రజలకు వివరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రణాళిక రూపొందించనున్నారు. 

119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్ లుగా ముఖ్య నేతలను నియమించింది. నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు పాలక్ లు. నియోజకవర్గాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్ లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించార. శేరిలింగంపల్లి పాలక్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మేడ్చల్ పాలక్ గా ఎంపీ లక్ష్మణ్, కుత్బుల్లాపూర్ కు డీకే అరుణ పాలక్ గా నియమితులయ్యారు. జుక్కల్ నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామిని పాలక్ గా నియమించారు. ఎల్లారెడ్డికి రఘునందన్, రామగండం, మహబూబ్ నగర్ ల పాలక్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పఠాన్ చెరుకు మురళీధర్ రావు, చేవెళ్లకు జితేందర్ రెడ్డి. పరిగికి విజయశాంతి, ఇబ్రహీంపట్నంకు ప్రకాశ్ రెడ్డి, సిరిసిల్లకు రాణీరుద్రమ, మెదక్ కు ధర్మపురి అర్వింద్ తో పాటు ముఖ్య నేతలకు పాలక్ లుగా బాధ్యతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించింది.