చాయ్ వాలాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీ

చాయ్ వాలాకు ఎమ్మెల్యే టికెట్  ఇచ్చిన బీజేపీ

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో చాయ్ వాలాకు బీజేపీ.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. మంత్రిని కాదని టీ కొట్టు నడిపే వ్యక్తికి కీలకమైన షిమ్లా అర్బన్ సీటు కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి సురేష్ భరద్వాజ్ నాలుగు సార్లు పోటీ చేయగా, ఇప్పుడు ఆయనకు కసుంప్టి నియోజకవర్గ టికెట్ ఇచ్చింది. ఆయన స్థానంలో చాయ్ వాలా సంజయ్ సూద్ ను అభ్యర్థిగా ప్రకటించింది.

పేద కుటుంబానికి చెందిన సంజయ్.. బస్టాండ్ లో పేపర్ అమ్ముకుంటూ చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక 1991లో షిమ్లాలో టీ షాప్ పెట్టుకున్నారు. 1980 నుంచి బీజేపీలో పని చేస్తున్న సూద్.. షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్​గా పనిచేశారు.