తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : ఖుష్బూ

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : ఖుష్బూ

సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ ​పాలనతో విసిగిపోయిన జనం మార్పును కోరుకుంటున్నారని బీజేపీ నేత, సినీ నటి కుష్బూ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మల్కాజిగిరి సెగ్మెంట్​లోని యాప్రాల్​లో  నిర్వహించిన రోడ్​షోలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రధాని మోదీ యువతకు ఉపాధి కల్పించే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగానే తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే లక్ష మందికి ఉద్యోగులు ఇచ్చారని పేర్కొన్నారు.  

రాష్ర్టంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ర్టంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆమె మండిపడ్డారు. ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. అప్పుడే రాష్ర్టం అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. రోడ్​షోలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి రామచందర్​రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.